ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక విచిత్రమైన బాతు ఉండేది. ఆ బాతు ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. రైతు ఆ గుడ్డును అమ్మి చాలా తక్కువ సమయంలోనే ధనవంతుడు అయ్యాడు. కానీ ఆ రైతుకు రోజురోజుకూ అత్యాశ పెరిగిపోయింది. "ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో చాలా బంగారు గుడ్లు ఉంటాయి. వాటన్నింటినీ ఒకేసారి తీసుకుంటే నేను ఇంకా పెద్ద ధనవంతుడిని అవ్వచ్చు" అని ఆలోచించాడు.
ఒకరోజు రైతు ఆశతో ఒక పెద్ద కత్తిని తీసుకుని, ఆ బాతు కడుపును కోశాడు. కానీ అతనికి బాతు కడుపులో ఎలాంటి బంగారు గుడ్లు కనిపించలేదు. అది మిగతా సాధారణ బాతుల లాగే ఉంది. రైతు తన తప్పు తెలుసుకునే లోపే ఆ బాతు ప్రాణాలు కోల్పోయింది.
రైతు తన అత్యాశ వల్ల ప్రతిరోజూ వచ్చే బంగారు గుడ్డును, ఆ బాతును శాశ్వతంగా కోల్పోయాడు. అతను తల పట్టుకుని ఏడవడం ప్రారంభించాడు, కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఈ కథ మనకు "అత్యాశ హానికరం" అని నేర్పుతుంది. ఉన్నదానితో తృప్తి చెందాలి.
No comments:
Post a Comment