మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

రాష్ట్ర బడ్జెట్ ఉద్యోగాల వ్యయం చాలా ఎక్కువ : సీఎస్ సమీర్ శర్మ

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు . ప్రభుత్వం ఇచ్చిన జీవోలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు . జీవోల వ్యవహారంపై సమ్మెకు సైతం సిద్ధమని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి . ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది . ఉద్యోగుల పీఆర్సీ , ఇతర అంశాలపై సీఎస్ సమీర్ శర్మ వివరణ ఇచ్చారు . సీఎస్ మాట్లాడుతూ .. " రాష్ట్రంపై కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది . రాష్ట్రానికి రూ . 62 వేల కోట్ల రెవెన్యూ ఉంది . కరోనా లేకపోయి ఉంటే రాష్ట్ర రెవెన్యూ రూ . 98 వేల కోట్లు ఉండేది . కొవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర రెవెన్యూ పడిపోయింది . గత పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది . ఒమిక్రాన్ కారణంగా రాష్ట్ర రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడింది . రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల వ్యయం చాలా ఎక్కువ .

ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు , సంక్షేమ పథకాలకు ఎలా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచించాలి . రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే ప్రభుత్వ కర్తవ్యం . రాష్ట్ర బడ్జెట్లో పీఆర్సీతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది . విద్య , సంక్షేమం , మౌలిక సదుపాయాలు , ఇతరత్రా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది . రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాం . ఆర్థికంగా రాష్ట్ర స్వరూపమే మారిపోయింది . రాష్ట్ర పరిస్థితులు దిగజారిపోయాయి . కరోనా వేళ ఇతర రాష్ట్రాలు సంక్షేమ పథకాలు తగ్గించాయి . సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించాం . ఉద్యోగులు , పింఛనర్లు అందరికీ ప్రభుత్వం న్యాయం చేసింది . రాష్ట్రానికైనా , కుటుంబానికైనా ఆర్థిక వనరుల వినియోగం ఒకేలా ఉంటాయి . పరిమితంగా ఉన్న వనరుల వినియోగంలో సవాళ్లు ఉంటాయి . ఉద్యోగులు , సంక్షేమం సహా అన్ని రంగాలకు ఆర్థిక వనరులు పంచాలి . కొవిడ్ వేళ చాలా రాష్ట్రాలు సంక్షేమ బడ్జెట్లో కోతపెట్టాయి . ఏపీలో సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నాం . విభజన నుంచి కరోనా వరకు ఆర్థిక వనరులు ఒడిదుడుకుల్లో ఉన్నాయి . పరిశ్రమలు , సర్వీసుల రంగం ఒడిదుడుకులకు లోనైంది . ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు . అందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం ” అని సీఎస్ వివరించారు

ఐ.ఆర్. అనేది జీతంలో భాగం కాదని గమనించండి.పిఆర్సి ఆలస్యం అవుతుందని ఐఆర్ ఇవ్వడం జరిగింది.

ప్రకటించిన  డీఏ లు అన్నీ కలిపి చూడండి... గ్రాస్ శాలరీ లో ఏ ఒక్క ఉద్యోగికీ జీతం తగ్గలేదు..

*కోవిడ్ వల్ల ఆదాయం చాలా తగ్గిపోయింది. కోవిడ్ లేకపోతే 98 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది.

LATEST POSTS

Pareeksha pe charcha photos upload link

 ఈరోజు ఫిబ్రవరి 10 పరీక్ష పే చర్చా ప్రత్యక్ష ప్రసార   కార్యక్రమం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వీక్షించిన ఫోటోలు అప్లోడ్ చేయవలసిన లింక్ 2)....