మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్లు.విద్యా హక్కు చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యా ర్థులకు 25 శాతం సీట్లు కేటాయించే దుకు సంబంధించిన విద్యా హక్కు చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం 12 ( 1 ) ( సి ) నిబంధనను సోమవారం తీసుకుందని పాఠశాల విద్యా శాఖ కమిష నర్ కె . సురేష్ కుమార్ చెప్పారు . ఆయన విద్యా హక్కు చట్టం రాష్ట్ర కమిటీ చైర్మన్ బుడితి రాజశేఖర్ , సభ్యులు , ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులు , ఎన్జీవోలతో సమావేశ మయ్యారు . 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున .. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు . ప్రైవేటు స్కూళ్లలో విద్యా హక్కు చట్టం 12 ( 1 ) ( సి ) ని తప్పకుండా చేసేందుకు ప్రైవేటు పాఠశాలల అసోసి యేషన్ ప్రతినిధులు , ఎన్జీవోలు అంగీకరిం చినట్లు కమిషనర్ తెలిపారు . ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చుకు సంబంధించిన నిర్ణయాలపై కమిటీ కూలంకషంగా చర్చలు జరిపిందని మీడియాకు చెప్పారు . సమావేశంలో సమగ్ర శిక్షా రాష్ట్ర సంచాల కులు కె.వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment

LATEST POSTS

AP Employees, Teachers Bifurcation Base GO MS NO.45 Released.The AP Public Employment (Organisation of Local Cadres and Regulation of Direct Recruitment) Order 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ మరియు నేరుగా నియామకాల కు సంబంధించి కొత్త జీవో (G.O.MS.No. 45) విడుదల చేసింది. దీని ప్...