మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

పీఆర్సీపై మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ

వేతన సవరణ సంఘం సిఫార్సుల్లో పెండింగ్‌ అంశాలపై చర్చించేందుకు సచివాలయంలో గురువారం మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. డీఏ రికవరీ నిలుపుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని, డీఏ, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని నాయకులు కోరారు. పీఆర్సీ ప్రతి ఐదేళ్లకు అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని, పెండింగ్‌ పీఎఫ్‌, జీఎల్‌ఐ బిల్లులు మంజూరు చేయాలని విన్నవించారు. ప్రభుత్వరంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, గురుకులాలకు పీఆర్సీ అమలయ్యేలా ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. వీటిపై శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు మంత్రుల కమిటీ బదులిచ్చింది. సీపీఎస్‌ రద్దుపై ఏప్రిల్‌ 4న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు ఉత్తర్వులు ఇచ్చేందుకు వారం సమయం పడుతుందని మంత్రులు పేర్కొన్నారు. పీఎఫ్‌, జీఎల్‌ఐ బిల్లుల డేటాను ఏప్రిల్‌ 4న ఇవ్వనున్నట్లు తెలిపారు. పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై చర్చించేందుకు ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించకపోవడం అప్రజాస్వామికమని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు హృదయరాజు విమర్శించారు.

LATEST POSTS

MJPAPBCWCET 2025 - MJPAP BCWREI 5th Class Admissions Notification 2025-26 Released.

మహాత్మా జ్యోతిభాపూలే ఆంధ్రప్రదేశ్ బిసి వెల్ఫేర్ విద్యాలయాలలో (MJP AP BC Welfare Schools) 2025-26 విద్యా సం. 5వ తరగతి నందు ప్రవేశాలకు నోటిఫిక...